స్వయంగా దోసెలు వేసిన ప్రియాంకాగాంధీ.. వీడియో వైరల్

-

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు, రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. అయితే వాటిలో కొన్ని వీడియోలు, ఫోటోలపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం ఇట్టే వైరల్ అవుతుంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ , క్రీడాకారులకు సంబంధించిన విషయాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఇరు పార్టీలకు చెందిన అగ్రశ్రేణి నేతలు ప్రచారం పర్వంలో మునిగిపోయారు. ప్రియాంకాగాంధీ మైసూరులో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నగరంలోని మైలారి అగ్రహార రెస్టారెంట్ కు ప్రియాంక వెళ్లారు. రెస్టారెంట్ లోని కిచెన్ లోకి వెళ్లి దోసెలు వేశారు. ఆమె వేసిన దోసెను కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version