తిరుప‌తిలోని శ్రీనివాసమంగాపురం ఆలయంలో ఘనంగా పుష్పయాగం…

-

ఈరోజు తిరుప‌తి లోని శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం ఎంతో ఘనంగా జరిగింది.
ఫిబ్రవ‌రి 14 నుంచి 22వ తేదీ వ‌ర‌కు జరిగిన బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు ముందుగానే తెలియచేసారు. ఈ యాగం చేపట్టడం వల్ల సమస్త పాప-దోషాలు తొలగిపోతాయని అన్నారు అర్చకులు. దీనిలో భాగంగా భూదేవి, శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపించారు.

Puspayagam | తిరుపతి శ్రీనివాసమంగాపురంలో వైభవంగా పుష్పయాగం

మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి మొత్తం 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం 3.5 టన్నుల పువ్వులతో పుష్పయాగం జరిపించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు పులకించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి దాతలు ఈ పుష్పాలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, గార్డెన్ మేనేజర్‌ జనార్దన్ రెడ్డి, ఏఈవో గురుమూర్తి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు భక్తులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news