సీఎం జగన్ అన్ని కులాలకు పెద్దపీట వేస్తున్నారు -ఆర్ కృష్ణయ్య

-

సీఎం జగన్ అన్ని కులాలకు పెద్దపీట వేస్తున్నారని వైసీపీ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అన్నారు. నాకు రాజ్యసభ అవకాశం కల్పించటం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇది బీసీ ఉద్యమానికి, ఉద్యమకారుడిగా నాకు ఒక గౌరవం, గుర్తింపు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు పెద్దపీట వేస్తున్నారని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతామని చెప్పి తర్వాత టికెట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీసీలకు ఈ స్థాయిలో పదవులు కేటాయించ లేదని తెలిపారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన బాగుందని కొనియాడారు ఆర్ కృష్ణయ్య. ఇక ఇది ఇలా ఉండగా.. కాసేపటి క్రితమే.. తాడేపల్లి చేరుకున్నారు రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో భేటీ అయ్యారుకృష్ణయ్య. సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం కానున్నారు కృష్ణయ్య. సాయంత్రం రాజ్యసభపై అధికారిక ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news