పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతం కావాలి – వైసీపీ ఎంపీ

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన విజయవంతం అయి, పొత్తులపై ఒక స్పష్టత రావాలని రఘురామకృష్ణ రాజు గారు ఆకాంక్షించారు. దుగ్గిరాలలో ఒక యువకుడు తన ప్లెక్సీని ఏర్పాటు చేస్తే, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు అతన్ని స్టేషన్ కు పిలిచి చితకబాదారని, రానున్నది తమ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.

తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే వారి చేతనే వాటిని తొలగించే విధంగా పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని, తన ప్లెక్సీని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని, ఎందుకంటే తాను ఆయన కంటే ఎత్తు ఉంటానని బాధ కాబోలు అని అన్నారు. తన ప్లెక్సీలను రోడ్లపై ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని, తనని అభిమానించే వారి గుండెల్లోనే ఉంటుందని రఘురామకృష్ణ రాజు గారు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version