రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ రన్నింగ్ రేస్..వీడియో వైరల్

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్‌ గాంధీ యాత్ర సాగుతోంది. నేడు తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్రప్రారంభమైంది. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో ముగిసింది. అక్కడే బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.

అయితే ఆదివారం రాహుల్ గాంధీ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చిన్నారులతో కలిసి ముచ్చటిస్తూ ముందుకు సాగారు రాహుల్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో పాటు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. పిల్లలతో కలిసి వేగంగా పరుగెత్తారు. పోటాపోటీగా రన్ చేసిన రేసులో రేవంత్ రెడ్డి వెనుకబడ్డారు. వేగంగా పరుగెత్తి ముందు నిలిచారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ, రేవంత్ వెంట పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి, సీనియర్ షబ్బీర్ ఆలీ కూడా పరిగెత్తారు. అయితే వాళ్ళిద్దరూ రేవంత్, రాహుల్ తో పరుగెత్తలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news