మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీస్తారా…. హనుమాన్ చాలీసా ప్లే చేయమంటారా..? : రాజ్ ఠాక్రే వార్నింగ్

-

మహారాష్ట్ర సర్కార్ కు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) అధ్యక్షడు రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యాలు చేశారు. మసీదు ముందు లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మసీదుల ముందు హనుమాన్ చాలీసాను వినిపిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. భద్రత కోసం ముంబైలోని మసీదులు, మదర్సాలు తనిఖీ చేసేలా పోలీసులను అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శివాజీ పార్క్ లో జరిగిన ఓ ర్యాలీలో రాజ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. శరద్ పవార్ కుల సంఘర్షణ పెంచుతున్నాడని మండిపడ్దారు రాజ్ ఠాక్రే. ఎన్సీపీ కులం కార్డును ఉపయోగిస్తోందని.. కులాన్ని సమాధి చేస్తే హిందూ ధర్మం బలపడుతుందని ఆయన అన్నారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ను చూస్తే తనకెంతో ఆనందంగా ఉందని… అక్కడ జరుగుతున్నట్లె మహాారాష్ట్రలో జరగాలని కోరుకున్నారు. త్వరలోనే అయోధ్య ను సందర్శిస్తానని రాజ్ ఠాక్రే వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news