అంత దారుణ స్థితికి రకుల్ ప్రీత్ సింగ్..?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..‘కెరటం’ సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. ఇక ఈ భామ..తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లిన ఈ సుందరి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నది. కాగా, తాజాగా ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరలవుతోంది.

 

రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రజెంట్ ఎటువంటి అవకాశాలు లభించడం లేదని తెలుస్తోంది. దాంతో రకుల్ తన రెమ్యునరేషన్ లో చాలా చేంజెస్ చేసుకుంటున్నదని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఒక్క ఫిల్మ్ కు రూ.2 కోట్లకుపైగానే రెమ్యునరేషన్ తీసుకునే రకుల్ ప్రీత్ సింగ్..ప్రజెంట్..డైలీ కాల్ షీట్స్ ప్రకారం డబ్బులు తీసుకునే స్టేజీకి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

ఒక్క రోజుకు రూ.3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుని రకుల్ ప్రీత్ సింగ్ వర్క్ చేస్తుందనే వార్తలొస్తున్నాయి. అయితే, రకుల్ ప్రీత్ సింగ్ గురించి వస్తున్న ఈ వార్తల్లో నిజమెంతుందో లేదో తెలియడం లేదు. కానీ, ప్రజెంట్ నెట్టింట ఈ వార్తలు బాగా వైరలవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు చివరగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ చిత్రంలో కనిపించింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో రకుల్ ప్రీత్ సింగ్ ‘ఓబులమ్మ’గా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news