రాహుల్ అడుగు పెడితే చాలు.. కాంగ్రెస్ ఓటమి ఖాయం..

-

దేశ వ్యాప్తంగా రాహుల్ ఏ నియోజకవర్గంలో అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అయినట్లే అని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఎద్దేవా చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ… నాడు 18  రాష్ట్రాల్లో రాహుల్‌ ప్రచారం చేస్తే 18 రాష్ట్రాల్లో కాం​గ్రెస్‌ ఓడిపోయిందని గుర్తు చేశారు. తెలంగాణలో భాజపా పవనాలు వీస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌  ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు.

పదవి కోసం, ఓట్ల కోసం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భాజపాను అధికారంలో కి తీసుకొస్తే భవిష్యత్ బంగారం అవుతుందన్నారు.  పేదలకు పక్కా ఇళ్లు కట్టించేంత వరకు వారి ఇంటికి అద్దెను సైతం భాజపా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news