తెలంగాణలో మూడోసారి టిఆర్ఎస్ పార్టీదే విజయం – కేంద్రమంత్రి

-

కేంద్రమంత్రి రాందాస్ అథవాలే హాట్ కామెంట్స్ చేశారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ అంటే ముచ్చటగా మూడో సారి టిఆర్ఎస్ పార్టీ నే విజయం సాధిస్తుందని… కెసిఆర్ ఏ ముఖ్యమంత్రి అవుతారని కేంద్రమంత్రి రాందాస్ వ్యాఖ్యానించారు.

కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి రాందాస్… ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణకు బిజెపి ఇంకా నిధులు ఇస్తుందని వివరించారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మళ్లీ టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. కాగా కేంద్రమంత్రి రాందాస్ వ్యాఖ్యలు తెలంగాణ బిజెపిలో పకం పనులు సృష్టిస్తున్నాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్రంలో బిజెపి పార్టీకి నష్టం చేకూరుతుందని పలువురు తెలంగాణ బిజెపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news