ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా డుప్లెసిస్… అధికార ప్రకటనే తరువాయి.

-

ఐపీఎల్ -2022 షెడ్యూల్ ఖరారైంది. చాలా రోజులుగా క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్న సమయం మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఈనెల 26 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. మార్చి 26న ముంబై వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఇదిలా ఉంటే కొన్ని ప్రాంఛైజీలు కెప్టెన్ వేటలో ఉన్నాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీంకు కొత్త కెప్టెన్ ఎవరా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతంలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో కొత్త కెప్టెన్ వేట ప్రారంభించింది ఆర్సీబీ.

అయితే ఈసారి ఆర్సీబీ కెప్టెన్ గా డుప్లెసిస్ పేరు దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డుప్లెసిస్ ను సారథిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఒక అధికార ప్రకటన మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. దీనిపై మార్చి 12న అధికార ప్రకటన ఉంటుందని ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి. మ్యాక్స్ వెల్, దినేష్ కార్తిక్ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కావడం, సీనియర్ ప్లేయర్ కావడంతో.. ఆర్సీబీ డుప్లెసిస్ కే మొగ్గు చూపారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news