పాలమూరు బిడ్డకు తన విధులను గుర్తుచేయండి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య రోజు మాటాల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మీడియా ముఖంగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంటే .. కేటీఆర్ మాత్రం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు.నిన్నమొన్నటివరకు కౌశిక్ రెడ్డి వ్యవహారం, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై రేవంత్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.

తాజాగా కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌస్‌లోకి వరద చేరి మోటార్లు మునిగిపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ పరికరాలు కనిపెట్టి ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డకు తన విధులను గుర్తుచేయండి. తెలంగాణకు, రైతులకు ముఖ్యమైన ప్రతిదాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version