లోకేష్ పి. ఏ పై వచ్చిన అభియోగాలు పక్కదారి పట్టించేందుకు నారీ దీక్ష- రోజా, వైసీపీ ఎమ్మెల్యే

-

నారీ దీక్షల పేరుతో టీడీపీ దొంగ దీక్షలు చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. లోకేష్ పీఏపై వచ్చి అభియోగాలను పక్కదారి పట్టించేందుకే నారీ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే మహిళలపై దాడులు జరిగాయని.. ఆమె దుయ్యబట్టారు. ఆడపిల్ల క్షోభపడుతూ చనిపోయిందని.. నారీ దీక్షటీడీపీ నేత వినోద్ జైన్ ఇంటి ముందు చేయాలని సూచించారు. టీడీపీలో నారీ నరకాసురులు, నారీ కామాంధులు ఎక్కవైపోయారని రోజా విమర్శించారు. కత్తెర పట్టుకుని తిరిగిన టీడీపీ మహిళా నేతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. తెలుగు మహిళలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అన్నారు. టీడీపీ పరిపాలనా కాలంలో మహిళలు పై ఎన్నో అకృత్యాలు , ఆత్యాచారాలు జరిగాయన్నారు. మహిళా సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని.. ఆడపిల్లలకు అన్యాయం జరిగిే సీఎం ఊరుకోరని.. అన్యాయం జరిగిన ఆడపిల్లలకు జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రోజా అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version