మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి సిద్ధం : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

మునుగోడు ఎమ్మె్ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. మునుగోడులో ఉప ఎన్నికల అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలో ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

Senior IPS officer RS Praveen Kumar takes voluntary retirement, says will  work for social justice- The New Indian Express

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీఎస్పీ గెలుపు చారిత్రక అవసరమన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. సామాజిక న్యాయం అజెండాగా ఉప ఎన్నికల్లోకి వెళ్తామని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రవీణ్‌ కుమార్‌ అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news