చంద్రబాబు హడావుడి చూస్తుంటే నవ్వొస్తోంది : సజ్జల

-

చంద్రబాబు హడావుడి చూస్తుంటే నవ్వొస్తోందని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేవలం మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకే టీడీపీ నేతలు ఇంతగా హడావిడి చేయడం అవసరమా అని అన్నారు అయన. గవర్నర్ ను కలవడం ఒక్కటే తక్కువ అన్నట్టుందని టీడీపీ నేతలను హేళన చేశారు సజ్జల. రాజీనామా చేయాలని మమ్మల్ని అంటున్నారు కానీ, చంద్రబాబే రాజీనామా చేయొచ్చు కదా…! అన్నారు. 175 స్థానాల్లో పోటీ పెట్టే ధైర్యం చణ్డత్రబాబు కి ఉందా? అని సవాల్ చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల వ్యవహరించిన విధానం సరికాదని అన్నారు సజ్జల . పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని తెలిపారు. కొందరు అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.

Sajjala satires on Chandrababu

ఒక్క బండిల్ చూస్తేనే ఆరు ఓట్లు తేడాగా కనిపించాయని, అన్ని బండిల్స్ పరిశీలిస్తే అసలు విషయం ఏంటో తెలుస్తుందని వృల్లడించారు. వైసీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారని, రీకౌంటింగ్ కోరడం అభ్యర్థి హక్కు అని స్పష్టం చేశారు సజ్జల. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటే అంటూ మండిపడ్డారుతొందరగా అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని వృల్లడించారు. అటు, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుపై తన ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు దొరను పోలిన దొంగ అంటూ విమర్శించారు. లేని కంపెనీలు సృష్టించడం నేరం అని, స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు పాత్ర ఉందని అన్నారు బొత్స. నాడు వోక్స్ వాగన్ కేసులో తామే సీబీఐ విచారణ కోరామని, స్కాంలో ఉన్నారు కాబట్టే టీడీపీ నేతలు నోరు మెదపడంలేదని మండిపడ్డారు బొత్స.

 

 

Read more RELATED
Recommended to you

Latest news