చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ యాత్ర : సజ్జల

-

టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేసేందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరాటపడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘గతంలో రెండు సార్లు చంద్రబాబు కోసం పవన్ పనిచేశారు. ఇప్పుడు మరోసారి పని చేస్తున్నారు. పవన్ ఖచ్చితమైన ఆలోచనలతో రాజకీయాలు చేయడం లేదు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అమిత్ షా విశాఖ సభలో చదివారు. దేశంలో ఏపీ భాగం కాదన్నట్లుగా అమిత్ షా మాట్లాడుతున్నారు.’’ అంటూ సజ్జల ధ్వజమెత్తారు.

“ఇప్పటిదాకా మీన మేషాలు లెక్కించిన పవన్ ఇప్పుడు వారాహి యాత్ర చేస్తానంటున్నాడు. ఇన్నాళ్లూ పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా? మాకేం అభ్యంతరం లేదు… తిరగొచ్చు. చంద్రబాబు ఇచ్చిన అసైన్ మెంట్ తో యాత్ర ప్రారంభిస్తున్న పవన్ నాలుగు డైలాగులు రాసుకుని వచ్చాడు. పవన్ కు ఓ రాజకీయ పార్టీ అధినేతకు ఉన్న విలువలు ఉన్నాయా? పవన్ ప్రజలను మోసం చేస్తున్నాడు… తనను నమ్ముకున్నవాళ్లను కూడా మోసం చేస్తున్నాడు. అది కూడా, మోసం చేస్తున్నానని బహిరంగంగా చెబుతున్నాడు. చంద్రబాబును సీఎం చేయడమే నా లక్ష్యం అని ఓపెన్ గా చెబుతున్నాడు” అని వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version