అయ్యన్న భార్య మహానటి సావిత్రిని మించిపోయింది – సన్యాసిపాత్రుడు

-

అయ్యన్న పాత్రుడు కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు సన్యాసిపాత్రుడు. అయ్యన్న పాత్రుడు భార్య మహానటి సావిత్రిని మించి నటించిందని ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు. మేము పార్టీ మారినప్పుడు నన్ను నా కొడుకుని పంపించడానికి అయ్యన్న పాత్రుడు రౌడీలను పంపారని.. పాలిటెక్నిక్ కాలేజీకి అయ్యన్న పాత్రుడు కుటుంబం భూములు ఇవ్వలేదు. మా తాత ముత్తాతలు ఇచ్చారు, దానిని గొప్పగా చెప్పుకుంటున్నారు.. అయ్యన్నపాత్రుడు 276 సర్వేనెంబర్‌లో ఆక్రమించారని అధికారులు చెబుతుంటే మీరు 277 సర్వేనెంబర్ చూపిస్తున్నారని మండిపడ్డారు సన్యాసిపాత్రుడు.

రెండు సెంట్లు స్థలం మీదే (అయ్యన్నపాత్రుడు) అయినప్పుడు ఎందుకు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు ఆదివారం అర్ధరాత్రి పూట స్టేలు తెచ్చుకోవలసిన అవసరం ఏముంది? కోస్తా టైగర్ అని చెప్పుకునే అయ్యన్న ఎందుకు దాక్కున్నారు? అయ్యన్నపాత్రుడు ఆక్రమించిన 2 సెంట్లు స్థలం రావనపల్లి రిజర్వాయర్ కాలువకు సంబంధించింది. అయ్యన్న ఆక్రమించిన స్థలంపై రిజర్వాయర్ కమిటీ మొదట్లోనే అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం తెలిపిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. వారివి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టారన్నారు సన్యాసిపాత్రుడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news