1000 రోజుల జగన్ పాలనలో 1000 మంది మహిళలపై రేప్‌ లు – టీడీపీ ఎమ్మెల్యే

-

1000 రోజుల జగన్ పాలనలో 1000 మంది మహిళలపై రేప్‌ లు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపణలు చేశారు. రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై అత్యాచారాన్ని ఖండిస్తున్నానని… ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో మహిళలపై రోజుకో రేపు.. పూటకో మర్డర్ జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు.

రేపల్లెను గంజాయి హబ్ గా తయారు చేశారని.. గంజాయి తాగి మహిళను గ్యాంగ్ రేప్ చేసారు అంటే ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి అనే దానికి అద్దంపడుతుందని ఆగ్రహంవ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో ఏపి బీహార్ గా మారిందని… దిశా చట్టం అంటూ మహిళా మంత్రులు మైకులు పట్టుకుని చెప్తున్నారని.. ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు.

రైల్వే స్టేషన్, బస్టాండ్లల్లో రక్షణ లేదని.. ప్రభుత్వ ప్రచారం ఆర్బాటాలకే పరిమితం అవుతుందని చురకలు అంటించారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఏపీని గంజాయి వనంగా ప్రభుత్వం మార్చిందని ఫైర్‌అయ్యారు. ఏపీలో పిచ్చి మద్యం,గంజాయి తాగి మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news