సికింద్రాబాద్ ఎఫెక్ట్.. అన్ని రైల్వేస్టేషన్‌లకు భారీ భద్రత

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఆర్మీ అభ్యర్థులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే రైల్వే స్టేషన్ లోకి చొచ్చుకెళ్లిన ఆర్మీ అభ్యర్థులు.. రాళ్లతో రైలు పై దాడి చేస్తూ నానా హంగామా సృష్టించారు.రాళ్లు రువ్వడంతో భయబ్రాంతులకు గురి అయిన ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో కొంతమంది ఆందోళనకారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకటో నంబర్‌ ఫ్లాంట్‌ ఫాం దగ్గర ఓ యువకుడు.. పోలీసుల కాల్పుల్లో మరణించారని సమాచారం.దీంతో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్ లకు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.సికింద్రాబాద్ తరహా ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news