జగన్‌ కు షాక్‌..నిధులు కాజేశారని గవర్నర్‌ కు సర్పంచుల ఫిర్యాదు !

-

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ కు దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. నిధులు కాజేశారని గవర్నర్‌ కు సర్పంచులు ఫిర్యాదు చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ప్రతినిధులు ఇవాళ కలిశారు. రూ. 7660 కోట్ల నిధులను పంచాయతీ ఖాతాల్లో నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని గవర్నరుకి ఫిర్యాదు చేసింది సర్పంచుల సంఘం.

కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులు రూ. 7660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానే ఏపీ సర్పంచులు. పంచాయతీ ఖాతాల్లోకి తిరిగి డబ్బు జమ చేయుంచాలని.. ఈ మేరకు గవర్నర్ జోక్యం కోరింది సర్పంచుల సంఘం. అయితే.. సర్పంచుల సంఘం ఫిర్యాదు మేరకు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సానుకూలంగా స్పందించారు. దీనిపై చర్చిస్తామనని వారికి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news