స్మృతి మంధాన కీలక నిర్ణయం.. బిగ్​బాష్​ లీగ్​కు దూరం

-

భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్​బాష్ లీగ్​కు దూరంగా ఉండాలని భావిస్తోంది. 2022 ఫిబ్రవరి నుంచి విరామం లేకుండా మ్యాచ్​లు ఆడుతోంది. ఫిబ్రవరిలో ఇండియా-న్యూజిలాండ్​​ ద్వైపాక్షిక టోర్నమెంట్​లో, ఆ తర్వాత వన్డే వరల్డ్​ కప్​లో ఆడింది. అనంతరం కామన్​వెల్త్​ గేమ్స్​లోనూ పాల్గొంది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్​తో ద్వైపాక్షిక సిరీస్​ ఆడుతోంది.

బిగ్​బాష్ లీగ్ అక్టోబర్ 13న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నవంబర్​ చివరి వరకు సాగుతుంది. అయితే.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 టోర్నమెంట్​ బిగ్​బాష్​ లీగ్​ నుంచి ఆమె తప్పుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి మంధాన వెల్లడించింది.  “మానసికంగా కాకున్నా.. ఫిజికల్​గా ఒత్తిడి లేకుండా మేనేజ్​ చేసుకోవడం కూడా ముఖ్యమే. బిగ్​బాష్ లీగ్​ నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను భారత జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్​లు మిస్​ కాదలచుకోలేదు. నేను భారత జట్టు తరఫున ఆడినపుడు.. నా నుంచి 100 శాతం ప్రదర్శన ఇవ్వాలనుకుంటాను” అని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news