క్షమించమంటున్న ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఎందుకంటే!

-

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాలకు క్యారాఫ్ అడ్రస్సుగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరినైనా విమర్శించడంలో ముందుండే కంగనా కాంట్రవర్సీలకు తెరతీస్తూ ఉంటారు. ఎవరికి భయపడకుండా తాను అనుకున్న దారిలో ముందుకు వెళ్లిపోతారు కంగనా. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని ముక్కు సూటిగా విమర్శిస్తూ వచ్చే కంగనా మొదటిసారిగా క్షమించమంటూ చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ బ్యూటీ కంగనా ధైర్యంగా విమర్శించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆమె ఒక పోస్ట్ పెడితే అది వైరల్ గా మారాల్సిందే. అయితే తాజాగా కంగనా తన 36వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను పంచుకొని ఇందులో క్షమించండి అంటూ చెప్పుకొచ్చారు.

కంగనా ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న వీడియోలో గులాబీ రంగు అంచుతో ఉన్న ఆకుపచ్చ చీరను ధరించి బంగారు నగలతో దగదగా మెరిసిపోతూ కనిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన తన తల్లిదండ్రులు, బోధించిన గురువులకు ధన్యవాదాలు తెలిపింది. తనను ద్వేషించే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలని కోరింది. కంగనా పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఈ వీడియోలో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. “నా శత్రువులు నన్ను విశ్రాంతి కూడా తీసుకోనివ్వకుండా చేశారు. నేను ఎంత సక్సెస్ అయ్యాను అన్నది కాదు ముఖ్యం. నన్ను నా పాదాలపై నిలుచుని, విజయ పథంలో నడిచేలా చేశారు. ఎలా పోరాడాలో నేర్పించారు. వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. నా స్నేహితులారా నా సిద్ధాంతం చాలా సులభం. నా ప్రవర్తన, ఆలోచనలు చాలా సాధారణం. అందరికీ మంచి జరగాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేశ సంక్షేమం కోసం మాట్లాడుతూ నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే అలాంటి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను.. ” అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version