శ్రీవారి భక్తులక అలర్ట్‌.. ఈ నెల 27న ప్రత్యేక దర్శన టికెట్లు

-

టీటీడీ శ్రీవారి భక్తులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. తిరుమలలో వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వచ్చే మూడు నెలలకు సంబంధించిన సేవా టికెట్లను విడుదల చేసిన టీడీడీ..ఇప్పుడు ప్రత్యేక ప్రవేశ దర్శనం పైన ప్రకటన చేసింది.ఈ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో సూచించింది.

TTD seeks land for Venkateshwara temple at Ayodhya; says cow is national  animal | Latest News India - Hindustan Times

అంతేకాదు, జూన్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను కూడా టీటీడీ నేడు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. ఏప్రిల్ మాసానికి సంబంధించి దివ్యాంగులు, వృద్ధుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను కూడా ఇవాళ విడుదల చేశారు. జూన్ నెలకు సంబంధించి ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ తదితర సేవల టికెట్లను కూడా నేడు అందుబాటులోకి తీసుకువచ్చారు. సనాతన హిందూధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి టీటీడీ ప్రచురిస్తున్న పుస్తకాలు నేటితరం వారికి కూడా సులువుగా అర్థమయ్యేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్ర నాథరెడ్డి సూచించారు. టీటీడీ ప్రచురణల విభాగం కార్యాలయంలో ఆయన జేఈవో శ్రీమతి సదా భార్గవి తో పాటు పలువురు ప్రముఖ సాహితీవేత్తలు,పండితులతో సమావేశం నిర్వహించారు.

 

వివిధ భాషల్లో టీటీడీ ప్రచురిస్తున్న పురాణాలు, గ్రంథాలు, హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రి అభినందించారు. ఇంతటి గొప్ప పని టీటీడీ మాత్రమే చేయగలుగుతుందని అన్నారు. ఇలాంటి గ్రంథాలలోని భాషను సరళీకరించి ప్రతి ఒక్కరికీ సులువుగా అర్థమయ్యేలా ప్రచురించాలని కోరారు. దీనివల్ల మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందన్నారు. డిజైన్, కంటెంట్ ప్రజెంటేషన్ , అర్థ,తాత్పర్యాలు చెడిపోకుండా విషయాన్ని వాడుక భాషలో చెప్పడం వల్ల ప్రైవేట్ ప్రచురణ కర్తలకు పోటీగా టీటీడీ ప్రచురణలు విశేష ఆదరణ పొందుతాయని రాజేంద్ర నాథ రెడ్డి సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news