Ambati Rayudu: మళ్లీ వైసీపీ పార్టీలో చేరనున్న అంబటి రాయుడు ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో సంచలన పోస్ట్ పెట్టాడు. సిద్ధం అంటూ అంబటి రాయుడు ఆసక్తికర పోస్టు పెట్టి పెను సంచలనానికి దారి తీశాడు. ఇటీవల వైసిపి పార్టీలో చేరిన అంబటి రాయుడు… ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు.

ambati rayudu

తర్వాత జనసేన పార్టీని పొగుడుతూ… వ్యవహరించాడు. ఇక ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ… మళ్లీ వైసీపీ పార్టీకి పాజిటివ్గా ట్వీట్ చేశాడు. దీంతో అంబటి రాయుడు మళ్ళీ వైసీపీ పార్టీలో చేరబోతున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంబటి రాయుడు లో ఇన్ని షేర్స్ ఉన్నాయా అంటూ ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version