Virat Kohli: లండన్‌లో కోహ్లీ- అనుష్క.. ‘శ్రీ రామ్ జై రామ్’ అంటూ !

-

Virat Kohli: లండన్‌లో కోహ్లీ- అనుష్క.. ‘శ్రీ రామ్ జై రామ్’ అంటూ ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ముంబైలో విజయ పరేడ్ లో పాల్గొన్న కోహ్లీ…. ఆ మరుసటి రోజు లండన్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ గురించి అతని భార్య అనుష్క శర్మ అప్డేట్ ఇచ్చారు.

Anushka Sharma, Virat Kohli Chant ‘Shree Ram, Jai Ram’ at a Kirtan in London, Video Goes Viral

విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ శనివారం లండన్ లో అమెరికన్ గాయకుడు కృష్ణదాస్ కీర్తనకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘శ్రీ రామ్ జై రామ్’ అని పఠిస్తూ కనిపించారు విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ యూనియన్ చేపల్ లో జరిగిన కార్యక్రమానికి ఇద్దరు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోను అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో విరుష్క జోడి ఈ కీర్తనలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version