ఇదే నాకు చివరి IPL.. ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రోజున సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే (8) మూడో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సొంత మైదానంలో ఆడుతున్న ధోనీ.. అభిమానులకు షాక్‌ ఇచ్చే కామెంట్స్ చేశాడు. తన క్రికెట్‌ కెరీర్‌ ముగింపు దశకు చేరుకుందని చెప్పాడు. తనకు వయసు అయిపోతోందనే వ్యాఖ్యలకు సిగ్గపడనన్నాడు.

‘‘ఇప్పటికే చాలామంది నా కెరీర్‌ గురించి మాట్లాడుతున్నారు. నేను ఎంతకాలం ఆడినా సరే.. ఇప్పుడు కెరీర్‌ చివరి దశలో ఉన్నాను. ఇప్పుడు దానిని ఎంజాయ్‌ చేస్తున్నా. వయసు పెరుగుతుందంటే మరింత అనుభవం వచ్చి చేరినట్లే. నేను ఎప్పుడూ వయసు పెరిగిపోతుందని చెప్పడానికి అస్సలు సిగ్గుపడను. సచిన్‌ టెండూల్కర్‌ 17 ఏళ్ల నుంచే క్రికెట్‌ ఆడటం ప్రారంభించాడు. పాతికేళ్లపాటు క్రికెట్‌కు సేవలు అందించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత అభిమానుల మధ్య ఐపీఎల్‌ ఆడటం ఆనందంగా ఉంది. మా ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా యువ బౌలర్‌ పతిరాన సూపర్‌ స్పెల్‌ వేశాడు. స్పిన్నర్లు రాణించడం బాగుంది’’ అని ధోనీ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news