ఐదో టెస్ట్ లో ఇంగ్లండ్ పై భారత్ ఘనవిజయం..!

-

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగాడు.  రెండు ఇన్నింగ్స్ లో కలిపి అశ్విన్ 9 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 7 వికెట్లు తీయడంతో టీమిండియా విజయం సునాయసం అయింది. 

జోరూట్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అశ్విన్ పటా పటా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ టార్గెట్ ని ఛేదించలేకపోయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 218, రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులు చేయడంతో  భారత్ ఇన్నింగ్స్ తో పాటు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరగా కుల్దీప్ యాదవ్  రూట్ ని ఔట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసింది. 128 బంతుల్లో 84 పరుగులు చేశాడు రూట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version