IND Vs BAN : కాన్పూర్ లో బంగ్లాతో రెండో టెస్ట్.. బీసీసీఐ కీలక ప్రకటన

-

చెన్నై చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో  బంగ్లాదేశ్ పై  280 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తుది జట్టు పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో టెస్ట్ లోనూ ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది బీసీసీఐ.

కాన్పూర్ టెస్ట్ నుంచి భారత స్టార్ పేసర్ బస్ ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి తొలుత అందరూ భావించారు. ఆ ఊహగానాలకు బీసీసీఐ తెరదించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి భారత్.. మూడోసారి ఫైనల్ చేరుకోవడం పై ఇప్పుడు దృష్టి సారించింది. ముందు ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కీలక టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో స్టార్ క్రికెటర్లను సన్నద్దం చేసేందుకు బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో గంభీర్, మేనేజ్ మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version