మ‌రో మ్యాచ్ లంక కైవ‌సం.. పోరాడి ఓడిన విండీస్‌..!

-

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో శ్రీ‌లంక మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇవాళ చెస్ట‌ర్ లి స్ట్రీట్‌లో జ‌రిగిన మ్యాచ్ లో లంక విండీస్‌పై 23 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో శ్రీ‌లంక మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇవాళ చెస్ట‌ర్ లి స్ట్రీట్‌లో జ‌రిగిన మ్యాచ్ లో లంక విండీస్‌పై 23 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 339 ప‌రుగుల ల‌క్ష్యంతో ఇన్నింగ్స్ కొన‌సాగించిన వెస్టిండీస్ కీల‌క‌ద‌శ‌ల్లో ముఖ్య‌మైన వికెట్ల‌ను కోల్పోవ‌డంతో ఆ జ‌ట్టు ప‌రాజ‌యం పాలైంది. కాగా మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.

శ్రీ‌లంక బ్యాట్స్‌మెన్ల‌లో ఆవిష్క ఫెర్నాండో (103 బంతుల్లో 104 పరుగులు, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), కుశాల్ పెరీరా (51 బంతుల్లో 64 పరుగులు, 8 ఫోర్లు)లు రాణించారు. కాగా వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీయ‌గా, షెల్డాన్ కాట్రెల్, ఒషానే థామస్, ఫేబియన్ అలెన్‌ల‌కు తలా 1 వికెట్ దక్కింది.

త‌రువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌ను కోల్పోయి 315 ప‌రుగుల వ‌ద్దే ఆగిపోయింది. విండీస్ బ్యాట్స్‌మెన్ల‌లో కోలాస్ పూరన్ (103 బంతుల్లో 118 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అయిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు చివ‌రికి ఓడిపోయింది. ఇక లంక బౌల‌ర్ల‌లో లసిత్ మలింగా 3 వికెట్లు తీయ‌గా, కుశాన్ రజిత, జెఫ్రీ వాండర్సే, ఏంజెలో మాథ్యూస్‌లు తలా 1 వికెట్ ప‌డ‌గొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news