Srinu Vaitla: అందుకే అంద‌రివాడు ప్లాఫ్‌.. చిరంజీవి పై శ్రీ‌ను వైట్ల సెన్సెష‌న‌ల్ కామెంట్స్

-

Srinu Vaitla: శ్రీను వైట్ల .. ఒకప్పుడు వరుస హిట్ల‌తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా త‌న సత్తా చాటిన డైరెక్ట‌ర్. కానీ, తర్వాత వరుస ఫ్లాపులు వెంటాడంతో కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడూ మంచు విష్ణుతో ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాతో త్వ‌ర‌లో పలకరించబోతున్నారు. ఈ సినిమా స‌క్సెస్ మీద‌నే ఇటు హీరో మంచు విష్ణు, శ్రీను వైట్ల కేరీర్ ఆధార‌ప‌డి ఉంది. తాజాగా శ్రీ‌ను వైట్ల.. ఆలీతో సరదగా కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుద‌ల‌య్యింది. త‌న కెరీర్ కు సంబంధించిన ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో ఆస‌క్తి క‌ర‌ కామెంట్స్ చేశారు.


మహేష్ బాబు ఓకే అంటే.. దూకుడు 2 తీయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్టు పేర్కొన్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆగ‌డు ఆగం కావడానికి , చిరంజీవి అందరి వాడు అట్ట‌ర్ ఫ్లాప్ కావాడానికి కార‌ణాలు వివ‌రించారు. తన అరంగేట్రం రాజశేఖర్ తోనే జరగాల్సింద‌ట‌.ఆ సినిమాకి “అపరిచితుడు” అనే టైటిల్ కూడా ఖరారు చేశారట‌. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదని తెలిపారు.

ఆ తర్వాతే రవితేజతో “నీకోసం” చేశానని తెలిపారు. ఆ సినిమా చూసిన రామోజీరావు ఇంప్రెస్ అయ్యి తన సంస్థలో సినిమా చేసే అవకాశం ఇస్తాం అన్నారట. మంచి రోజు చూసి సినిమా మొదలు పెడతాను అంటే “చెడ్డ రోజే మొదలు పెట్టు.. ఆ సినిమా ఎందుకు ఆడదో చూద్దాం” అని అన్నారట. ఇక వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన “ఆనందం వ‌చ్చింద‌ట‌. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

‘దూకుడు’ అజిత్‌తో చేయాల్సిందని, ఎందుకు చేయాలేక‌పోయాన‌ని.. ఫీలవుతున్నాయని అన్నారు. అంద‌రివాడు ఫ్లాప్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఆ క‌థ త‌న‌ది కాద‌నీ, అలాగే చిరు మెగా హీరో కావ‌డం వ‌ల్ల స‌రిగా చేయాలేక‌పోయ‌న‌ని చెప్పుకోచ్చారు. ఇప్పుడు ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్‌గా మారింది. శ్రీ‌ను వైట్ల కెరీర్ లో ఆగడు త‌ర్వాత ‘బ్రూస్లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ వ‌రుస‌గా డిజాస్టర్స్‌గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news