ప్రభాస్ దర్శకుడితో సినిమాకు మెగా హీరో గ్రీన్ సిగ్నల్..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్..వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కాగా, అంతకుముందు ఆయన నటించిన ‘సాహో’ చిత్రం నార్త్ ఇండియాలో బాగా ఆడింది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ పిక్చర్..సూపర్ గా ఉందని ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ ను ప్రశంసించారు. ఆ సినిమా ‘సాహో’ను డైరెక్ట్ చేసిన యువ దర్శకుడు..సుజీత్..అప్పటి నుంచి తర్వాత ఏ సినిమా చేయలేదు. కాగా, ఆ దర్శకుడికి మెగా హీరో అవకాశం ఇచ్చినట్లు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

F3 ఫిల్మ్ తో ఇటీవల హిట్ అందుకున్న వరుణ్ తేజ్..సుజీత్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. ‘గని’ చిత్రంతో ఫెయిల్యూర్ అందుకున్న వరుణ్ తేజ్..‘ఎఫ్ 3’ మూవీతో సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సుజీత్ తో చేయబోయే సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news