Breaking : బీజేపీ కీలక నిర్ణయం.. తెలంగాణ ఇంచార్జీగా సునీల్ బ‌న్స‌ల్‌

-

2024 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయా పార్టలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షణాది రాష్ట్రాలపై ఫోకస్‌ పెంచిన బీజేపీ తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్రమంలో బీజేపీ ఓ కీల‌క నియామ‌కాన్ని ప్ర‌క‌టించింది. బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ బ‌న్స‌ల్‌ను నియ‌మించింది బీజేపీ అధిష్టానం. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా బుధ‌వారం సాయంత్రం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

यूपी बीजेपी में बड़े फेरबदल की तैयारी, सुनील बंसल का हो सकता है प्रमोशन, नए  संगठन मंत्री की रेस में हैं ये नाम - up bjp set for major revamp general  secretary

ప్ర‌స్తుతం బీజేపీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాఖ ప్ర‌ధాన కార్య‌దర్శిగా కొన‌సాగుతున్న బ‌న్స‌ల్‌కు తాజాగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పించారు. అంతేకాకుండా ఆయ‌న‌కు తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జీ బాధ్య‌త‌ల‌తో పాటుగా ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా శాఖ‌ల ఇంచార్జీగానూ నియ‌మించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీలో చేరికలు పెరుగుతున్నాయి. తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఈ నెల 21 తరువాత బీజేపీలకి ఊహించని రీతిలో చేరికలు ఉంటాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news