దిల్లీ వాసులను కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకోనివ్వండి : సుప్రీం కోర్టు

-

దీపావళి పర్వదినాన దిల్లీ వాసులను కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకోనివ్వండని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పండుగ పూట వారి డబ్బుని కాస్త స్వీట్ల కోసం ఖర్చుపెట్టనివ్వండని పేర్కొంది. దిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘ దీపావళి సమయంలో ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి. వారి డబ్బును స్వీట్ల కోసం ఖర్చు పెట్టనివ్వండి’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు దిల్లీలో బాణాసంచా వినియోగం, విక్రయాలపై కాలుష్య నియంత్రణ కమిటీ నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వ్యాపారులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టేందుకు నిరాకరించింది.

దిల్లీలో బాణాసంచా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. టపాసుల విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు. అలాగే టపాసులు కొనుగోలు చేస్తే రూ.200 జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దిల్లీలో చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం టపాసులపై బ్యాన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news