ఎల్బీనగర్ లో 9 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి

-

ఎల్బీనగర్ లో 9 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది.ఎల్ బీ నగర్ చంద్రపురి కాలనీలో చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. వర్షిత అనే చిన్నారి నాలుగు అంతస్తుల భవనంపై నుండి కిందపడి మృతి చెందింది.మన్సూరాబాధ్ లోని ఒక ప్రైవేట్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతుంది బాలిక .బాలిక కింద కు దూకిందన్న ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు,ఏ సంబంధం లేని ఈ నాలుగు అంతస్థుల భవనం ఎందుకు ఎక్కల్సి వచ్చింది ? అని ఆరా తీస్తున్నారు.

ఆటో లో ఈ బిల్డింగ్ వద్దకు బాలిక వచ్చినట్లు సీసీటీవీ కెమెరాల్లో పరిశీలించారు పోలీసులు.చిన్నారి వర్శిత నివాసం మన్సూరాబాద్ లోని మధురా నగర్ కాలనీ.. కానీ చిన్నారి పడిపోయిన భవనం ఎల్ బీ నగర్ లోని చంద్రపురి కాలనీ.ఈ బిల్డింగ్ కు..చిన్నారి కుటుంభానికి ఎలాంటి సంబంధం లేదు.ఒకవేళ చనిపోవాలని అనుకున్నా… ఈ బిల్డింగ్ నే ఎందుకు ఎంచుకుంది. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version