గెలిచే సీటులో ‘సైకిల్’కు పంక్చర్లు!

-

రాజకీయాల్లో మంచి మంచి అవకాశాలు అప్పుడప్పుడు వస్తుంటాయి…అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు చక్కగా ఉపయోగించుకోవాలి…అప్పుడే రాజకీయంగా సక్సెస్ వస్తుంది. అయితే సక్సెస్ దగ్గరగా ఉన్నప్పుడు కూడా అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతుంది…దర్శి నియోజకవర్గంలో టీడీపీ. నిజానికి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక…టీడీపీ ఎక్కడకక్కడ పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే వైసీపీ అధికార బలం వల్ల టీడీపీకి పుంజుకోవడానికి అవకాశాలు రావడం లేదు. పైగా పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది.

అయినా సరే టీడీపీ నేతలు కొన్ని చోట్ల కష్టపడి పనిచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కొన్ని చోట్ల పుంజుకుంటుంది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం కూడా టీడీపీకి కలిసొస్తుంది. అలాగే దర్శి లో కూడా టీడీపీ పుంజుకుంది..ఇక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరగడం, అలాగే టీడీపీ ఇంచార్జ్ పమిడి రమేష్..నియోజకవర్గ స్థాయిలో కష్టపడి పనిచేయడంతో దర్శిలో టీడీపీ రేసులోకి వచ్చింది. దర్శిలో కీలకమైన శిద్ధా రాఘవరావు, కదిరి బాబూరావు లాంటి వారు టీడీపీని వదిలి వెళ్ళిన సరే రమేష్ మాత్రం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చారు.

అలాగే సీనియర్ల సపోర్ట్ తో దర్శి మున్సిపాలిటీలో ఊహించని విధంగా టీడీపీని గెలిపించుకున్నారు. ఇలా మున్సిపాలిటీని గెలుచుకున్న టీడీపీ..వచ్చే ఎన్నికల్లో దర్శి సీటులో గెలవడం కూడా ఖాయమని ప్రచారం జరుగుతుంది. అలాంటి తరుణంలో ఇంచార్జ్ రమేష్ పార్టీకి షాక్ ఇచ్చారు..పార్టీ అధిష్టానం తనని గుర్తించడం లేదని చెప్పి..రమేష్ పార్టీని వీడారు. తాను ఎంత కష్టపడినా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసి…టీడీపీకి రాజీనామా చేసి..దర్శిలోని పార్టీ ఆఫీసుకు తాళం కూడా వేసేశారు.

అయితే సీటు కేటాయించే సీటు విషయంలో క్లారిటీ లేకపోవడం వల్లే రమేష్ పార్టీని వదిలేశారని తెలుస్తోంది. ఇప్పటికే దుబాయికి చెందిన సుబ్బారావు…బాలయ్యతో ఉన్న సాన్నిహిత్యంతో దర్శి టికెట్ కోసం ట్రై చేస్తున్నారట. ఇటు రమేష్ కూడా దర్శి టికెట్ రేసులో ఉన్నారు. ఇక ఈ విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వట్లేదు..దీంతో రమేష్ అసంతృప్తికి గురై…పార్టీని వదిలారు. రమేష్ పార్టీని వీడటం దర్శిలో టీడీపీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. మొత్తానికి గెలిచే సీటులో టీడీపీకి పెద్ద డ్యామెజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news