రేపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల భేటీ

-

కాసేపటి క్రితమే తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక రేపు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు, ఎంపీలు. మరోసారి కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిసి ఖరీప్ సీజన్ లో పండే
వరిధాన్యం కొనుగోలు పై స్పష్టత కోరనున్నారు తెలంగాణ మంత్రులు, ఎంపీలు.

ప్రస్తుతం ముంబయ్ లో ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్… రేపు ఢిల్లీ కి వచ్చిన తర్వాత, తెలంగాణ నేతల బృందం.. ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఉదయమే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో సహా, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. లోకసభ టి.ఆర్.ఎస్ నాయకుడు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు. ఇక ఈ రోజు రాత్రికి మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు, గంగుల ప్రభాకర్, పలువురు ఎంపీలు ఢిల్లీకి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news