ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ప్రాణాలు తీసుకున్నాడు..వీడియో వైరల్

-

ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ప్రాణాలు తీసుకున్నాడు ఓ యువకుడు. హైదరాబాద్ – సనత్ నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తూ రైలు ఢీకొని మహమ్మద్ సర్ఫారాజ్ అనే యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

ఇక ఈ సంఘటన పై మృతుడి తండ్రి సాదిక్ & బంధువులు మాట్లాడుతూ.. మా బాబు సనత్ నగర్‌లో రైల్వే ట్రాక్‌ పై ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేస్తుండగా రైలు ఢీకొని మృతి చెందాదు అని తన స్నేహితులు సోహెల్ మోజమిల్ చెప్పారు…మాకు ఈ ఇద్దరిపై అనుమానం ఉందని వెల్లడించారు.

మా బాబుని సోహెల్ & మోజమిల్ చంపేశారా లేక ట్రైన్ డి కొట్టిందా తెలియదు…రైల్వే ట్రాక్‌ పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో రికార్డ్ చేస్స్తే ట్రైన్ వచ్చే ముందు తెలుస్తుందన్నారు. మా బాబుతో పాటు ఉన్న ఇద్దరి ఫోన్ కూడా స్పాట్ లోనే వదిలేసి ఎస్కేప్ అయ్యారు…మహ్మద్ సర్ఫరాజ్‌కు సోషల్ మీడియా ఖాతా ఉందని వివరించారు. విచారణ చేసి.. పోలీసులు మాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version