దేశంలోని అన్ని పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలే: కేఎ పాల్

-

తెలంగాణలో ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఓటర్లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా ఎవరెవరికో దోచుకునే వారికి అవకాశం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేఏపాల్ రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి, కుటుంబ పార్టీలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బిజెపి అంటే భయం అన్నారు కే ఏ పాల్. కాంగ్రెస్ మినహా దేశంలోని మిగిలిన అన్ని పార్టీలు బిజెపి అనుబంధ పార్టీలేనని అన్నారు. తన వెనుక బీజేపీ ఉందనే విమర్శలు అర్ధరహితం అన్న పాల్.. అవి పని లేని కొందరు చేసే విమర్శలు గా కొట్టిపారేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ ఇలాంటి ఆరోపణ చేస్తోందని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news