ఆల్ టైం రికార్డు ధర పలికిన మిర్చి..క్వింటాల్‌ రూ.35 వేలు క్రాస్‌

-

మిర్చి.. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ధర పలుకుతోంది. పసిడి ధరలతో పాటు పోటీ పడుతూ.. మిర్చి రేటు విపరీతంగా పెరిగిపోతుంది. దేశ చరిత్రలోనే ఆల్‌ టైం రికార్డు ధర నమోదు చేసింది. ఈ నెల 3 వ తేదీన క్వింటాల్‌ మిర్చి రూ.32 వేలు అధికంగా పలకగా.. సోమవారం రోజున ఏకంగా రూ.35 వేలకు అమ్ముడు పోయింది.

ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్‌ యార్డులలో.. ఒకటైన వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ లో మిర్చి కి భారీ ధర పలికింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌ కు చెందిన బి. రాజేశ్వర్‌ రావు.. మార్కెట్‌ కు 40 బస్తాలు తీసుకురాగా.. ఓ వ్యాపారి అత్యధికంగా క్వింటాల్‌ రూ.35 వేల చొప్పున కొనుగోలు చేశారు.

సోమవారం మార్కెట్‌ కు సుమారు 35 వేల బస్తాలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. రంగులు, సుగంధ ద్రవ్యాలు, పచ్చళ్లు, నూనెలు దేశీ రకం మిర్చిని విరివిగా వాడుతుండటంతో.. అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఏర్పడిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news