2028లో అధికారంలోకి వస్తాం…MIM ఆనవాళ్లు లేకుండా చేస్తాం !

-

Bandi Sanjay: 2028లో అధికారంలోకి వస్తాం…MIM ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శేరిలింగంపల్లి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఒవైసీ ఒక్కటై పోటీ చేసినా బీజేపీ ఎదుర్కొవడంతోపాటు గెలిచి తీరుతామని తెలిపారు.

Bandi Sanjay dares AIMIM ahead of upcoming Telangana Assembly Polls

ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. 2014లో 11 కోట్లు.. 2019లో 7 కోట్లు… కలిపి మొత్తం 18 కోట్ల మంది సభ్యులున్న అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ బీజేపీ. చైనాలోని నియంత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని అధిగమించి రికార్డు స్రుష్టించిన పార్టీ బీజేపీ. ఈసారి దేశవ్యాప్తంగా అదనంగా 10 కోట్ల మందితో సభ్యత్వం నమోదు చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నం. తెలంగాణలో 50 లక్షల మంది సభ్యత్వం టార్గెట్… పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి బీజేపీకి పడ్డ ఓట్లు 77 లక్షలకుపైనే ఉందని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version