V6ను రద్దు చేస్తే.. తెలంగాణ ప్రజలంతా ఉరికించి కొడతారు – బండి సంజయ్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశం సంతాప సభ ను తలపించిందని బండి సంజయ్‌ చురకలు అంటించారు. కేసీఆర్ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది మరో 3, 4 నెలలే, ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీయే. పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఫస్ట్ తేదీన జీతాలిస్తాం, నెలరోజుల్లో డీఏలను చెల్లిస్తాం, వెంటనే పీఆర్సీని నియమించి అమలు చేస్తామని ప్రకటించారు.


ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ బదిలీలు, ప్రమోషన్లు ఇస్తాం. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు టీచర్ల, ఉద్యోగుల సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదు. టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నాం , బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తాం. వీ6 ఛానల్ ను రద్దు చేస్తారట… దమ్ముంటే రద్దు చేయ్ బిడ్డా… నీ సంగతి చూస్తా… గతంలో ఏబీఎన్, టీవీ9 ను బ్యాన్ చేస్తే ప్రజలంతా వ్యతిరేకించారు. ఈసారి వీ6 ను రద్దు చేస్తే తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ నేతలను ఉరికించి కొడతారు.. నీ ప్రభుత్వాన్ని రద్దు చేసే రోజులు రాబోతున్నయ్. తప్పు చేసినోళ్లను సీబీఐ, ఈడీ వదిలిపెట్టదు. బొట్టు పెట్టి ‌పిలవదు. గుంజుకుపోయి జైల్లో వేస్తది. వాటితో బీజేపీకి సంబంధం లేదన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news