బిజేపి ఆపరేషన్ ఆకర్ష్.. ఈటలకు కీలక పదవి !

-

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. జిహెచ్ఎంసి ఎన్నికల నుంచి ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ పై తెలంగాణ ప్రజల్లోనూ కాస్త నమ్మకం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజున విజయ సంకల్ప సభ పేరుతో ప్రధాని మోడీ అలాగే అగ్ర నేతలు టిఆర్ఎస్ పార్టీపై ఎదురు దాడి చేశారు. టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి నిలవాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు నేతలు.


ఇంకా ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్షను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతలను ముఖ్యమైన నేతలకు అప్పగించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మన్ గా ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఇంద్రసేనారెడ్డి కోరారు. ఈ నేపథ్యంలోని ఆ బాధ్యతలను ఎమ్మెల్యే ఈటల అలాగే కో- చైర్మన్ గా వివేక్ వెంకట స్వామికి అప్పగించాలని బిజెపి ఆలోచన చేస్తోంది. వీరిద్దరైతే తెలంగాణ ఉద్యమకారులు… బిజెపిలో చేరే అవకాశం ఉంటుందని అగ్ర నేతలు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news