సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి..!

-

లోక్ సభ ఎన్నికల పోలింగ్ వేళ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించారంటూ తాజాగా బీజేపీ ఎలక్షన్ కమిషన్కు కంప్లెంట్ చేసింది.

ఇవాళ కొడంగల్లో ఓటు వేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి మోడీ, బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పోలింగ్ వేళ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ఫిర్యాదులు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version