మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ ని రావద్దంటూ అవమానించారు :కేటీఆర్

-

టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచుతోంది. పార్టీ ప్లీనరీతో తన ఉద్దేశ్యాన్ని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పనితీరు, ప్రధాని మోదీలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ వెళ్లలేదు. దీనిపై అప్పట్లో బీజేపీ, టీఆర్ఎస్ పై విమర్శలు చేసింది. సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధాని  మోదీ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో సీఎం హోదాలో ప్రధానికి స్వాగతం పలకాల్సి ఉన్నా కేసీఆర్ వెళ్లలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే వెళ్లారు. అయితే ప్రోటోకాల్ వివాదంపై తాాజాా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు పీఎం మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ ని రావద్దంటూ పీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయని… మంత్రి కేటీాఆర్ అన్నారు. గతంలో భారత్ బయోటెక్ సందర్శన సందర్భంలో కూడా ఇలానే జరిగిందని వెల్లడించారు. రావద్దని లేఖలు రాసి సీఎంను అవమానిస్తున్నారని… తిరిగి ప్రోటోకాల్ పాటించలేదని నిందలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news