తెలంగాణ ప్రజలకు శుభవార్త..ఈనెల 15లోగా క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఈనెల 15లోగా క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేయనుంది కేసీఆర్‌ సర్కార్‌. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశించారు.

ఈ నెల 15లోగా జీవో-59 కు సంబంధించిన పట్టాల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. జీవో-58కి సంబంధించి మిగిలి ఉన్న పట్టాలను త్వరగతిన అందించాలని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలని… మరో 40 రోజుల్లో ప్లాంటేషన్ ప్రారంభించేందుకు సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్లకు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version