పాలకులారా ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ఉందా? – ఈటెల రాజేందర్

-

రాష్ట్రంలో చాలా స్కూళ్లు, కాలేజీలలో టాయిలెట్లు లేవని విమర్శించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. చాలా స్కూళ్లలో ఒకే టాయిలెట్ ఉండడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ” పాలకులారా ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ఉందా? అవార్డులు వస్తున్నాయి, మేమే గొప్ప అని చెప్పుకోవడం కాదు. కనీస అవసరాలు తీర్చండి ” అని ట్వీట్ చేశారు. అంతేకాక ఎందుకు సంబంధించిన ఓ పేపర్ క్లిప్పింగ్ షేర్ చేశారు ఈటెల రాజేందర్.

అంతకుముందు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ లోని తిరుమల గార్డెన్స్ లో ఓబీసీ మోర్చా మేడ్చల్ జిల్లా శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణని అప్పుల తెలంగాణగా మార్చేశారని కేసీఆర్ పై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news