బీజేపీ నేత రఘునందన్ రావు పై ఎఫ్ఐఆర్ నమోదు

-

లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, మెదక్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. రోజుల క్రితం ఫిర్యాదు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. ఈ నేపథ్యంలో సంగారెడ్డి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇటీవల జరిగిన బీజేపీ సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఇంకోసారి ఎవరైనా తన పేరు తీసి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. అంగీ, లాగు ఊడదీసి మరి కొడతా అని హరీశ్ రావు తదితర బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటికి వచ్చి మరి కొడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version