కాంగ్రెస్ ఖతం, గతం…రేవంత్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు – హరీష్‌ రావు

-

కాంగ్రెస్ ఖతం, గతం…రేవంత్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తారని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదని.. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేయలేక పోయారని ఆగ్రహించారు. 0టిఆర్ ఎస్ పాలనలో కొడంగల్ కొత్త రూపు సంతరించుకున్నదని.. రేపో మాపో పాలమూరు నీళ్ళు తెచ్చి మీ పాదాలు కడుగుతామని వెల్లడించారు.

పాలమూరు పై కేసులు వేస్తున్నారు, అడ్డుకుంటున్నారు. అయినా పనులు ఆగవని.. మీ పక్కనే కర్ణాటక బార్డర్ ఉంది. ఒక్కసారి అడిగి తెల్సుకోండి సూచించారు. కర్ణాటకలో డబుల్ డెక్కర్ ప్రభుత్వం ఉంది. ఏమైందీ 6 గంటలు కూడా కరెంట్ రావడం లేదని.. 8,9 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎందుకు అభివృద్ధి చేయలేదని రేవంత్‌ ను నిలదీశారు. రైతు డిక్లరేషన్ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ లో చేయండని సవాల్‌ విసిరారు. మీరు అధికారంలోకి వచ్చేది లేదు.. ఆ అవకాశమే లేదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news