ఈ నెల 25న హర్యానాకు సీఎం కేసీఆర్..కారణమిదే !

-

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసిఆర్ పావులు కదుపుతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ దేశ పర్యటనలో మునిగిపోయారు. ఇటీవల బీహార్ వెళ్ళిన ముఖ్యమంత్రి మరికొద్ది రోజుల్లో హర్యానా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవిలాల్ జయంతి ఉత్సవాలకు కేసిఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తున్నది.

ఈనెల 25న ‘సమ్మన్ దివస్’ పేరుతో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే కెసిఆర్ తో పాటు బిజెపి వ్యతిరేక పార్టీలన్నీటికి ఆహ్వానం అందింది. కాగా, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటే మాత్రం కేసిఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు హాజరు కావడం లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వెళతారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా మాత్రం కెసిఆర్ పర్యటన ఇంకా కన్ఫామ్ కాలేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news