మోడీ…ఇలాంటి 10 సభలు పెట్టినా ప్ర‌జ‌లు న‌మ్మ‌రు – ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

-

ప్రధాని మోడీ సభపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయా రామ్ – గాయ రామ్ ల‌తో తెలంగాణ‌కు ఒరిగేదేమి లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇలాంటి పది సభలు పెట్టినా తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌రని చురకలు అంటించారు. ప‌దే ప‌దే రాష్ట్ర విభ‌జ‌న‌పై మాట్లాడుతూ తెలంగాణ‌పై విషం క‌క్కుతున్న బీజేపీ అని… బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని ఫైర్ అయ్యారు.

నీళ్లు, నిధులు, నియామకాల గురించి పదే పదే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ప్ర‌భుత్వం ఈ ఎనిమిదేళ్ళ‌లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్ప‌లేదని.. తెలంగాణ అభివృద్దికి ఏం చేస్తారో చెప్ప‌కుండా బీజేపీ స్వంత డప్పుకొట్టుకుందని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల‌పై పీయూష్ గోయ‌ల్ మొస‌లి కన్నీరని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news