ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా చెప్పం – కేటీఆర్

-

నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రాంభించారు ఐటీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండూర్ పట్టనంలో 40 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రహదారి సుందరీకరణకు 30 కోట్లుతో రాబోయే రెండు నెలలో చండూర్ ను అందంగా ముస్తాబు చేస్తామన్నారు. అలాగే రెండు కోట్ల రూపాయల తో సమీకృత మార్కెట్, 50 లక్ష లతో షాపింగ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. గత రెండు నెలల్లో రెండు సార్లు ఇక్కడికి రావడం జరిగిందన్నారు.

చండూర్, చౌటుప్పల్ తో మున్సిపాలిటీల అభివృద్ధి చేస్తామన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్యని శాశ్వతంగా తీర్చింది కేసీఆర్ అన్నారు మంత్రి కేటీఆర్. అదే పద్దతిలో సాగు నీరు అందిస్తామన్నారు. ఎన్నికల ముందు ఒకలాగా.. ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పం అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పేదవాడి మొఖంలో చిరునవ్వు ఉండాలి అనేది కెసిఆర్ లక్ష్యం అన్నారు మంత్రి. మీరు ఆశీర్వదీస్తే రెట్టింపు అభివృద్ధి పనులు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news